ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముసునూరు జనసేన

నూజివీడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరపున జనసేన నాయకులు పాశం నాగబాబు ఆధ్వర్యంలో ముసునూరు మండలంలోని రమణక్కపేట జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శారదని సన్మానించి, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచిపెట్టిన నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, చేకూరి సాయి, నరేంద్ర, త్రినాథ్, రాజబోయిన సుబ్బు, శివ తదితర జనసైనికులు పాల్గొన్నారు.