ఓటు పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్

కాకినాడ సిటి: కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు & సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చేపడుతున్న పోలింగ్ కేంద్రాలలో ఓటు పరిశీలన కార్యక్రమంలో రెండవరోజు దుమ్ములపేట పోలింగ్ కేంద్రాల వద్ద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఓటు అన్నది భారత రాజ్యాంగం కల్పించిన ఒక గొప్ప హక్కు అని గుర్తించుకుని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ప్రతి ఓటరు బాధ్యతగా తన ఓటు వివరాలు జాబితాలో సరిగా ఉన్నాయోలేవో చూసుకోవాలని సూచించారు. దురదృష్టం కొద్దీ మనం ఏనాడూ ఊహించని విధంగా నేడు ఈ వై.సి.పి ప్రభుత్వం హయాములో ఓటరుల జాబితానుండీ వ్యతిరేక పార్టీ ఓటరులని గందరగోళానికి గురిచేస్తూ అక్రమంగా వారికికూడా తెలియకుండా వారి ఓటుని, ఇంకో పక్క వేరే ప్రాంతాల వారిని ఇక్కడ కూడా ఓటరులుగా నమోదు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ ముఖ్యమంత్రి వై నాట్ 175 అని అంటే దానర్ధం ఇదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్ధంగా గెలవలేమని ఈ వై.సి.పి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందనీ దీనిపై ప్రజలందరూ అప్రమత్తమై తమ ఓటుని కాపాడుకుని వై.సి.పి ని వచ్చే ఎన్నికలలో ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ముత్తా శశిధర్ గారి సూచనల మేరకు నగరంలో జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ సూర్యనారాయణపురంలోని పోలింగ్ కేంద్రాలను, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య సాలిపేట ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ జాబితాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, సిటీ సెక్రెటరీ కొండ దుర్గాప్రసాద్, మోస ఏసేబు, దాసరి వీరబాబు, అమర్నాథ్, దొర, ఎల్లాజీ, చిన్న తదితరులు పాల్గొన్నారు.