సామాజిక చైతన్య యాత్ర ప్రారంభించిన ముత్తా శశిధర్

కాకినాడ సిటి, స్దానిక జగన్నాధపురంలోని ముత్తానగర్లో నేడు జనసేన పార్టీ నాయకులు కాకినాడ సిటి జనసేన ఉపాధ్యక్షులు ఓలేటి రాము నేత్రుత్వంలో అట్ల సత్యన్నారాయణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆలోచనా స్ఫూర్తితో సామాజిక చైతన్య యాత్ర కార్యక్రమం జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆరంభించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ తమ పార్టీ 10వ ఆవిర్భావ సభ సందర్భంగా తమ నాయకులు పవన్ కళ్యాణ్ సమాజంలో అన్ని కులాలవారు అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చిన స్ఫూర్తితో తాము అమరజీవి జయంతి నుండి అంబేడ్కర్ జయంతి వరకు అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ఈ వార్డులో తిరుగుతు ప్రజలను కలిసి మాట్లాడుతూ నేడు ఈ వై.సి.పి ప్రభుత్వం పేద కులాలకు చేస్తున్న అన్యాయాన్ని చర్చించారు. సమాజం అంటే అనేక రకాల కులాల కలయిక అని అందులో పేదరికంతో బాగా వెనుకబడిన కులాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని కానీ నేటి ఈ వై.సి.పి ప్రభుత్వం తన కుటిల రాజకీయం, అధికార దాహంతో విభజించు పాలించు అనే పద్ధతిలో ఆంగ్లేయుల పాలనకన్న దారుణమైన కుతంత్రాలలో సమాజాన్ని విచ్చిన్నం చేస్తోందనీ దీనిని జనసేన పార్టీ తరుపున ఖండిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి జనసేన పార్టీ అధ్యక్ష్యుడు సంగిసెట్టి అశోక్, పెసంగి రాజేష్, సుమంత్, ముత్యాల దుర్గా ప్రసాద్, రావి శ్రీను, ఆటో శ్రీనివస్ జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.