పెళ్ళి ఫొటోలలో నాకు నచ్చిన ఫొటో: నిహారిక
మొన్నటి వరకూ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా సోషల్ మీడియా లో నిలచిన నిహారిక పెళ్లి వేడుక ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా అంగరంగ వైభవంగా జరిపిన సంగతి తెలిసిందే. ఈ వివాహం కోసం నాగబాబు రూ. 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టాక్. కనులపండువగా జరిగిన మెగా వెడ్డింగ్లో చిరంజీవి,పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుస్మిత, స్నేహా రెడ్డి తదితరులు సందడి చేశారు. డిసెంబర్ 9న జరిగిన నిహారిక పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి.
అయితే పెళ్లి వేడుకలో తనకు ఎంతో ఇష్టమైన ఫొటో ఇదే అంటూ నిహారిక తన ఇన్స్టాగ్రామ్లో ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటో కూడా నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నూతన దంపతులు హనీమూన్ కోసం మాల్దీవులకి వెళ్లగా, అక్కడ అందాలని ఎంజాయ్ చేస్తున్నారు.