బొబ్బిలిలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన

బొబ్బిలి నియోజకవర్గం, కమ్మవలస కొండ, దేవుపల్లి గ్రామల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ గేదెల సతీష్, జనసైనికులు జమ్మూ గణేష్, గౌరీ శంకర్ ఆధ్వర్యంలో “మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన” క్యాంపెయిన్ లో భాగంగా 18 సంవత్సరాల దాటిన జనసైనికులకి వీర మహిళలకి పార్టీ పట్ల వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తూ కొత్తగా ఓటు హక్కుకి అప్లై చేయడం జరిగింది. ఇందులో మనోజ్, సత్యనారాయణ, సాయి, జగదీశ్, రాము, వీర మహిళలు అఖిల, రామ, కమ్మవలస మరియు కొండ దేవుపల్లి గ్రామం జనసైనికులు పాల్గొన్నారు.