గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన

నెల్లూరు: మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అంటూ ఓటర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం 4వ రోజు కూడా నెల్లూరు నగరం స్టాన్ హౌస్ పేటలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కువగా యువత అంతా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉంది. మీ మద్దతు ను ఓట్ల రూపంలో చూపించాలి. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలి సమాజంలో నైతిక హక్కులను తెలుసుకొని ఉండాలి. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకుని విధిగా తమ ఓటును వినియోగించుకోవాలి. ఇంకా ఎవరైనా ఓటు నమోదు చేసుకోకపోతే వివరాలు పంపిస్తే అప్డేట్ చేస్తాం. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకొని సుపరిపాలనకు అందరూ చేతులు కలపాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి లభించాలన్నా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని కుటుంబ సభ్యులకు కూడా తెలియపరచండి అని తెలిపారు.. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు ప్రశాంత్ గౌడ్, బన్నీ, వరా, కేశవ తదితరులు పాల్గొన్నారు.