నా మొదటి ఓటు జనసేనకే

మదనపల్లి నియోజకవర్గం, స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్ విద్యార్థుల చేత నా మొదటి ఓటు జనసేనకే(మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన) అనే పోస్టర్ ను విద్యార్థుల చేత రిలీజ్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు చాలా ప్రాధాన్యం ఉందని ఒక మంచి వ్యక్తిని ప్రజల తరఫున అసెంబ్లీ పంపించాలంటే ఆ ఓటు అనేది సక్రమంగా వినియోగించి మంచి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని అలాగే విద్యార్థులు మొదటి ఓటును మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మంచి పరిపాలన అందించగలరని పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడిని ఎన్నుకోవడం ద్వారా రాష్ట్రానికి మంచి పరిపాలన అందించడంతో పాటు ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని రానున్న ఎన్నికల్లో దాదాపు మూడు లక్షల మంది యువత కొత్తగా ఓటర్ల నమోదయి ఓటు వేయబోతున్న సందర్భంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, బీసీ సంఘం నాయకులు వెంకటేష్, ధరణి, హర్షవర్ధన్, నరేంద్ర, సునీల్ కుమార్, వీర మహిళలు మల్లికా లక్ష్మీదేవి రూప శోభ తదితరులు పాల్గొన్నారు.