అమలాపురం 2వ వార్డులో “నా సేన కోసం నా వంతు”

కోనసీమ జిల్లా, జనసేన పార్టీ వారి నా సేన కోసం నావంతు కార్యక్రమంలో భాగంగా క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆదేశాల మేరకు అమలాపురం పురపాలక సంఘ 2వ వార్డు లోనిర్వహించారు. జనసైనికులు తమ తమ మొబైల్ నుంచి పార్టీ సూచించిన నెంబరుకు ఫోన్ పే చేయడం జరిగింది. అదేవిధంగా ఆ వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీకి సహకరించాలని దీన్ని నిర్మాణాత్మకంగా నడిపించడానికి నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తూము రమేష్, పార్టీ క్రియాశీలక సభ్యులు నల్లా సత్యవతి, తూము సత్య, అరిగెల చంటి, ఆశేట్టి సాయి, కుంపట్ల బాలు, చప్పిడి తేజ, దులిపుడి పండు, నల్లా సాయి, కుంచనపల్లి మాధవి, వర్రే శ్యామల, అరిగెల సాయి, ఏడిద మణి, వాకాడ పండు పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొన్నారు.