పాయకరావు పేటలో ‘నా సేన కోసం నా వంతు’

అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో గత నాలుగు రోజులు నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల జనసైనికులకు తెలియజేసి పార్టీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయడానికి ఈ “నా సేన కోసం.. నా వంతు” కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్ళేలా కృషి చేయవలసిందిగా జనసైనికులు సహకారం అందించాలని గెడ్డం బుజ్జి కోరడం జరిగింది. అనంతరం నాయకులు, కార్యకర్తలు తమ వంతుగా వారి అకౌంట్ నుండి పార్టీకి విరాళాలు అందించి “నా సేన కోసం.. నా వంతు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.