రాజానగరంలో “నా సేన కోసం నా వంతు”

రాజానగరం, జనసేన పార్టీకి అండగా తమ వంతు బాధ్యతగా విరాళాలు అందించే కార్యక్రమమే “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం పుణ్యక్షేత్రం గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ నాయకులు మద్దిరెడ్డి బాబు సమక్షంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కష్టాల్లో ఉన్న ప్రజలకు, వివిధ కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్న జనసేన పార్టీకి భావితరాల వారికి ఉజ్వలమైన భవిష్యత్తును ఇవ్వాలన్న సంకల్పంతో, విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ పలు ప్రజా కార్యక్రమాలు చేస్తున్నందున వాటికి ఆర్థికంగా ప్రజలే ఆర్థిక విరాళాలు అందించి, మంచి సమాజాన్ని నిర్మించడానికి పునాది వేయాలన్న ‘బత్తుల’ దంపతుల పిలుపుమేరకు ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు, జనసేన పార్టీ బలోపేతం కోసం విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.