దర్శి జనసేన ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

  • వరికూటి సమక్షంలో జనసేనలో చేరికలు

దర్శి నియోజకవర్గం, దర్శి పట్టణం, లంకోజనపల్లి రోడ్ లో దర్శి పట్టణ జనసైనికులు నీలిశెట్టి ప్రభు, పాశం వెంకటేష్, పసుపులేటి శ్రీను, నీలిశెట్టి ఏడుకొండలు ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమానికి హాజరైన దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు. ఈ కార్యక్రమానికి హాజరైన వరికూటి నాగరాజుని పూలతో స్వాగతం పలుకుతూ వరికూటికి జిందాబాద్ అంటూ నినాదాలతో ఘనస్వాగతం పలికిన వీర మహిళలు జనసైనికులు. వరికూటి సమక్షంలో పార్టీలోకి చేరిన 10, 11వ వార్డులోని కుటుంబాలు. జనసేన పార్టీ కండువాను కప్పి జనసేనలోకి ఆహ్వానించిన వరికూటి నాగరాజు జనసేన మీద మీరు చూపిస్తున్న ఈ మమకారం మమ్మల్ని పార్టీని గెలిపించుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అంటూ తెలియజేశారు. దర్శి పట్టణంలో మరియు నియోజకవర్గంలో జనసేన ఇంత పటిష్టంగా బలపడుతున్నందుకు చాలా సంతోషమని తెలియజేశారు. పూల స్వాగతంతో ఆహ్వానించి శాలువాతో సత్కరించిన గ్రామస్తులు అనంతరం కేక్ ను కట్ చేసిన వరికూటి నాగరాజు ‘నా సేన కోసం – నా వంతు’ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో గణపా శ్రీనివాసులు, షేక్ బాషా, షేక్ ఇర్షాద్, నీలిశెట్టి యోగేశ్వరరావు, నీలి శెట్టి రమేష్, పాశం శ్రీకాంత్, పాశం శేషమ్మ, పసుపులేటి ఆంచన్, నీలిశెట్టి వెంకటరామయ్య, గోగు శ్రీను, గోగు రమేష్, పాశం సురేష్, ఓబులాపురం కొండ బండారు సుబ్బారావు మరియు దర్శి నియోజకర్గ జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.