పాలకొండ జనసేన ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

పాలకొండ నియోజకవర్గం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం పాలకొండలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటున్నారు వారికి అండగా మా బాధ్యతగా పాలకొండ జనసేన పార్టీ నుంచి జనసైనికులు తమ వంతు విరాళాలను పార్టీ ఫోన్ పే నెంబర్ 7288040505కు పంపించడం జరిగింది. ఇదేవిధంగా పాలకొండ జనసేన పార్టీ నుండి పార్టీకి ఏ సేవ కావాలన్నా మేము ముందు ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ జనసైనికులు, సీతంపేట జనసైనికులు, భామిని జనసైనికులు మరియు వీరఘట్టం జనసైనికులు పాల్గొనడం జరిగింది.