కౌన్సిల్ లో సమస్యలపై గళమెత్తడాన్ని ప్రశంసించిన నాదెండ్ల
పెదగంట్యాడ: విశాఖ పర్యటనలో ఉన్న జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ సోమవారం పెదగంట్యాడ లోని జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ కి పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ పటిష్టత, చేపడుతోన్న కార్యక్రమాల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కౌన్సిల్ లో పలు అంశాలను ప్రస్తావిస్తున్న తీరు, సమస్యలను లెవనెత్తుతున్న విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే పందాలో ముందుకెళ్లాలని, ప్రజల సమస్యలపై పోరాటాన్ని కొనసాగించాలని నాదెండ్ల ఆకాంక్షించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రజలకు వివరించాలని సూచించారు. గాజువాక లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-01-at-8.40.45-PM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-01-at-8.40.44-PM-1024x461.jpeg)