బద్దిరెడ్డి ముత్యాలరావు కుటుంబ సభ్యులకు భీమా చెక్కు అందజేసిన నాదెండ్ల

రాజమండ్రి రూరల్, తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతులమీదుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు బద్దిరెడ్డి ముత్యాలరావు ప్రమాద భీమా చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల భీమా చెక్కును అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పిఎసి మరియు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.