ఈతకోటలో నాదెండ్ల మనోహర్ కు ఘనస్వాగతం పలికిన జనసేన, బీజేపీ నేతలు

తూర్పుగోదావరి జిల్లా, రావులపాలెం పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం పాటుపడుతున్న జనసైనికులు, జనసేవకులు కోనసీమలో జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు పర్యటనలో భాగంగా రావులపాలెం మండలం ఈతకోటలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల లక్ష్మీ దుర్గేష్, కొత్తపేట నియోజకవర్గ బండారు శ్రీనివాస్ జిల్లా పార్టీ నేతలు శ్రేణులతో కలిసి స్వాగతం పలికారు. మత్సకారుల సమస్యలపై వారితో చర్చించేందుకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని గన్నవరం, రాజోలు అంతర్వేది పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు మండలం పరిధిలోని ఈతకోట గ్రామం చేరుకున్న నాదెండ్ల మనోహర్ కు మిత్రపక్షమైన బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు స్వగృహం వద్ద అమలాపురం పార్లమెంట్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి, బీజేపీ నేతలు మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికి శాలువాను కప్పి విఘ్నేశ్వరుని చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. జనసేన వీరమహిళ గండ్రోతు అరుణ ఆధ్వర్యంలో జనసేన నేతకు హారతినిచ్చారు. అనంతరం జనసేన పార్టీ గ్రామ నాయకులు యర్రంశెట్టి రాంమోహన్ రావు(రాము) ఇంటివద్ద మండల పార్టీ అధ్యక్షుడు తోట స్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల పలువురికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ… రానున్న రోజుల్లో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి రాష్ట్రములో అధికారంలోకి రావడం ఖాయమన్నారు 2024 విజయమే లక్ష్యంగా ఇరు పార్టీలు నాయకులు కలిసి కట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి జనసేన నాయకులు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జులు… డి.ఎం.ఆర్ శేఖర్, పాటంశెట్టి సూర్యచంద్ర, పితాని బాలకృష్ణ, పంతం నానాజీ, అత్తి సత్యనారాయణ, వై. శ్రీనివాస్, వీరమహిళలు గంటా స్వరూపరాణి, మాకినీడి శేషుకుమారి, సుంకర కృష్ణవేణి, ప్రియా సౌజ్యన్య, సరోజ, పల్లవి, బొరుసు సీతారత్నం సుబ్రహ్మణ్యం, బండారు బాబీ, మల్లవరపు నాగబాబు, కొత్తపల్లి శ్రీనివాస్, తాళ్ల డేవిడ్, సూరపురెడ్డి సత్య, అంబటి కిషోర్, ఆర్.డి.ఎస్ ప్రసాద్, కంకటాల పవన్ మణికంఠ, జువ్వల యేసు, అంబటి మణికంఠ, తెలగరెడ్డి శరత్ పవన్, చిక్కం శివాజీ నాయుడు, అధిక సంఖ్యలో కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన జనసైనికులు, జనసేవకులు తదితరులు పాల్గొన్నారు.