అంగరంగ వైభవంగా నాదెండ్ల పుట్టినరోజు వేడుకలు

తెనాలి అసెంబ్లీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జనసేన పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు రోజు సందర్భంగా శనివారం జనసేన పార్టి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయసినారు. ఈ సందర్భంగా ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బి.జె.పి. పార్టీల కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు, అందరూ కలిసి అత్యధిక మెజారిటీతో నాదెండ్ల మనోహర్ ను గెలిపించుటకు సైనికులుగా పనిచేయాలని అన్నారు. చింతా రేణుకా రాజు మాట్లాడుతూ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పొత్తు ధర్మంలో భాగంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నాదెండ్ల ను గెలిపించి పవన్ కళ్యాణ్ కు గిఫ్టుగా ఇవ్వాలని అన్నారు . ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.