ప్రయాణికుల ఇబ్బంది చూసి స్పందించిన నడిపల్లి జనసేన

నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం నడిపల్లి గ్రామంలో ఏదైతే సమస్య ఉందో కానూరు నుంచి నడిపల్లి, నడిపల్లి కోట మీదుగా తణుకు వెళ్లే రహదారి ఏదైతే ఉందో నడిపల్లి, నడిపల్లి కోట మధ్య 1 కిలో మీటర్ దూరం రహదారి పెద్ద పెద్ద గుంతలతో అస్తవ్యస్తంగా ఉంది దానికి తోడు వర్షం కురవడంతో ఆ రోడ్లో ఉన్న గోతులు అన్ని వర్షం నీరుతో నిండిపోయాయి. ఎంతోమంది ప్రయాణిస్తున్న ప్రయాణికులు చాలా ఇబ్బంది పడడం చూసి. నడిపల్లి జనసేన కార్యకర్తలు వెళ్లి ఏవైతే గుంతలు ఉన్నాయో రహదారి పక్కన చిన్న చిన్న గాడులు తవ్వి నీళ్లు పక్కకు మళ్ళించడం జరిగింది. ఈ పనికి సహకరించిన నడిపల్లి జనసేన కార్యకర్తలు చిటికెన గణపతి, దాసరి శ్రీను, దాస్యం సత్యకృష్ణ, కాశంశెట్టి అంజి, కోలా నరసన్న, కోలా నాగబాబు, గేదెల చిరంజీవి, అన్యం లక్కీ, మేడిశెట్టి సతీష్, మొరం పోసి బాబు, పువ్వుల సత్యనారాయణ, పి.ఎస్.ఎన్. అలాగే జనసేన ప్రోగ్రాంకమిటీ మూర్తి సహకరించడం జరిగింది.