అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన నాగర్ కర్నూల్ జనసేన

నాగర్ కర్నూల్: భారత రాజ్యాంగ నిర్మాతగా భారత దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ కురుమన్న, జాని, కొడిగంటీ సాయి కుమార్, బారిగారి రాజేందర్, సూర్య, నారముల్ల రవీందర్, దేశమొనేని రాజేష్, తదితరులు పాల్గొన్నారు.