యాపిల్ సేవలపై నాగార్జున ఆగ్రహం..
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపిల్ సేవలు.. ఏక పక్షంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ట్విటర్ వేదికగా నాగ్.. తన కోపాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా యాపిల్ సేవల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘భారత్లోని యాపిల్ స్టోర్ నుంచి యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేటప్పుడు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. వాళ్ల సేవలు, పాలసీలు ఏక పక్షంగా ఉన్నాయి. ఇది మరీ ఘోరమైన చర్య.’ అని నాగ్ పేర్కొన్నారు. అయితే, తన ఆగ్రహానికి గల కారణాన్ని మాత్రం నాగ్ బయటపెట్టలేదు.