కౌలు రైతు భరోసా యాత్రకు నరసరావుపేట జనసేన తరఫున విరాళం

మంగళగిరి: జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చనిపోయిన ప్రతి రైతుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం అందరికీ తెలిసిన విషయమే.. దాని నిమిత్తము నరసరావుపేట జనసేన ఇంచార్జ్ సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో నరసరావుపేట జనసేన కార్యకర్తల నుండి సేకరించిన 7,20,000 అక్షరాల ఏడు లక్షల ఇరవై వేల రూపాయల చెక్కును జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ కు నరసరావుపేట జనసేన పార్టీ ఇంచార్జ్ సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు సుమారు 30 మంది మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసి చెక్కును అందజేయడం జరిగినది.