నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో చేరికలు

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం యర్రంశెట్టి పాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పితాని మురళీకృష్ణ, కవురు శ్రీనివాసు, కట్టా పల్లయ్య, కంకటాల దివాకర్, గుత్తుల విక్రమ్ కుమార్, కట్టా సాయి, కంకటాల నాగేశ్వరరావు, పూతినీడి నరేంద్ర, పూతినీడి రాము, పూతినీడి సత్యనారాయణ, కట్టా కాశీ, పితాని సత్యనారాయణ, తంగెళ్ళ చంద్రరావు, పితాని పెద్దిరాజు, పితాని వెంకటేశ్వరరావు మరియు దాదాపుగా 60 మంది టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చాగంటి మురళీకృష్ణ (చిన్నా),ఆకన చంద్రశేఖర్ వలవల నాని, బందెల రవీంద్ర, యర్రంశెట్టి బాబులు, యర్రం శెట్టి హరి, యర్రం శెట్టి మధు, యడ్లపల్లి మహేష్, పులపర్తి రాంబాబు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *