బైక్ ర్యాలీతో జనసేనానికి ఘన స్వాగతం పలికిన నరసరావుపేట జనసేన

నరసరావుపేట నియోజకవర్గం: రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటనలో సుమారు 87 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి పర్చూరు విచ్చేయుచున్న సందర్భంలో.. నరసరావుపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి జిలాని ఆధ్వర్యంలో.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయం నుండి ద్విచక్రవాహనంలో భారీ ర్యాలీగా బయలుదేరి.. చిలకలూరిపేట సెంటర్లో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. జి ఎస్ ప్రసాద్, అద్దేపల్లి ఆనందబాబు, కృష్ణం శెట్టి గోవిందు, ఆర్కే యాదవ్, బెల్లంకొండ అనిల్, అబ్దుల్ రవూఫ్, జేష్ట మల్లిబాబు, గుప్తా శ్రీకాంత్, మిరియాల సోము, ఎస్. శ్రీనివాసరావు, నాగుల్ మీరా, మేడిశెట్టి రామారావు, జయరామ్, సంజయ్, సంతాన్, రాము, సాంబయ్య, మణి, యమలయ్య, ఎస్.కే సుబాని తదితరులు పాల్గొన్నారు.