నర్సీపట్నం జనసేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుక

నర్సీపట్నం, రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జనసేన నాయకులతో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించి రాజ్యాంగ దినోత్సవం గూర్చి ఈ విధంగా అన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని మూడేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన అధ్యయనం తర్వాత 1947 నవంబర్ 26 అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదిస్తే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని సుదీర్ఘకాలంపాటు మూడేళ్ల పాటు అధ్యయనం చేసిన తర్వాత అమలులోకి తీసుకు వచ్చారని రాజ్యాంగంలోని పీటిక మరియు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక బాధ్యతలు ప్రజలకు కవచాలు అయితే మిగిలిన విభాగాలు రాజ్యాన్ని తీర్చిదిద్దడానికి కావలసిన మార్గాలని ఆనాడు అంబేద్కర్ అన్నారని శాసనాలు చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదేశిక సూత్రాల్లో పొందుపరచాలని సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కల్పించడం ద్వారా ప్రజల సంక్షేమం పెంపొందించాలని సంపద ఏ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని అందరికీ అందేటట్లు చూడడం పని అందేటట్లు చూడటం విద్యకు అవకాశం కల్పించడం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం మన దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగ పుట్టిన నవంబర్ 26 గుర్తుపెట్టుకోవాలని అంబేద్కర్ జయంతి రోజు 2015లో నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది అని కొనియాడారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని జనసేన పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఉంటారు అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊది చక్రవర్తి, ఉగ్గిన రమణ, కొత్తకోట రామశేఖర్, పినపోతుల నాగు, అల్లు నరేష్, మాకిరెడ్డి వెంకటరమణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.