పాయకరావుపేట జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

పాయకరావుపేట: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎస్ రాయవరం మండల సీనియర్ జనసైనికులు లింగంపల్లి జ్యోతి కుమార్ ఆధ్వర్యంలో పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవరం మండలం, భీమవరం పరిది లోని రైతుల వద్దకు నేరుగా వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది, ఈ సందర్బంగా రైతులు ప్రభుత్వం తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఈసారి తప్పకుండా ఒక అవకాశం ఇచ్చి ఆయనను గెలిపించుకుంటేనే మా యొక్క రైతు కష్టాలు తీరుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగంపల్లి ప్రసాద్, లంకా సంతోస్, భీశెట్టి సతీష్, పప్పల వాసు, పులి సత్తిబాబు, బత్తుల రామకృష్ణ, శైక్ జానీ, లింగంపల్లి బాలకృష్ణ, బోడ్డా నవీన్, బోండా ఆది, లింగంపల్లి గంగాధర్, తుమ్మపాల నానాజీ, చిట్టీ సత్య గణేష్, కార్యకర్తలు, గ్రామ రైతులు మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది.