శృంగవరపుకోట జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

శుక్రవారం శృంగవరపుకోట నియోజకవర్గంలో వేపాడ, ఎల్.కోట మండల జనసేన సైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపబడ్డాయి. ఈ యొక్క కార్యక్రమం వేపాడ మండల అధ్యక్షులు సుంకరి అప్పారావు, మరియు యల్. కోట మండల సీనియర్ జనసేన నాయకులు ఎస్.కె. ఫిరోజ్ ల ఆర్థిక సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. దీనికి గాను సీనియర్ జనసేన నాయకులు, జొన్న పల్లి సత్తిబాబు, రామేళ్ల శివాజి, అలమండ రాంబాబు, బుజ్జి, రావడ నాయుడు, మనోజ్, గొర్లె శ్రీను, వెన్ను రాజు, వీర మహిళా విభాగం నుంచి అడపా కళ్యాణి, వెంకట లక్ష్మి, ఎర్ర వెంకటలక్ష్మి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పి.ఏ.సి ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మరియు, శృంగవరపుకోట నియోజకవర్గ వబ్బిన సత్తిబాబు హాజరు కావడం జరిగింది.