అనంతపురం అర్బన్ లో ఎన్.డి.ఏ కూటమి ప్రచారం

అనంతపురం అర్బన్: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కమలానగర్, వెంకట్ రెడ్డి కొట్టాలు, డీ.సీ.ఎంఎస్ రోడ్డు నందు ఆదివారం సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా జనసేన – టిడిపి- బిజెపి కూటమి ఉమ్మడి అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని మరియు అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు అంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ లతో కలిసి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.