మదనపల్లె పట్టణంలో ఎన్.డి.ఏ కూటమి భారీ ర్యాలీ

మదనపల్లె పట్టణంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా ఇంటి వద్ద నుండి చిత్తూరు బస్టాండ్ నెహ్రు బజారు అప్పారావు వీధి బెంగళూరు బస్టాండ్ మీదుగా నీరుగట్టువారి పల్లె వరకు జరిగిన ర్యాలీలో మదనపల్లి ఎన్.డి.ఏ కూటమి శాసనసభ అభ్యర్థి షాజహాన్ బాష, పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడు నిఖిలేష్ రెడ్డి గారితో ఎన్నికల ప్రచార చివరి రోజు రోడ్డు షో ర్యాలీలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, టీడీపీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి, నాదెండ్ల విద్య, మదనపల్లె బి ఎస్ ఎస్ బీపీల్ విజయ్ కుమార్, జనసేన రవి, మళ్ళీ కుమార్, శేఖర్ విజయ్, గంగులు, బీజేపీ ప్రశాంత్ భగవాన్, భవాని ఇంకా టీడీపీ, బీజేపీ, జనసేన ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.