నెల్లూరు జనసేన మీడియా సమావేశం

  • నాదెండ్లపై కేతం రెడ్డి వాఖ్యలను ఖండించిన జనసేన నాయకులు

నెల్లూరు: జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో అన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకులతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్లపైన కేతం రెడ్డి చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ ని సీఎం చేసుకునేందుకు తిరుగుతున్నానని నమ్మబలికిన మీరు మీ వెంట అందరూ మద్దతుగా నిలిచారని, కాపు నాయకులు టచ్ లో ఉన్నారని చెప్తున్నారు అదంతా అప్పుడు, ఇప్పుడు టచ్ చేసి చూడు నీకు ఎవరు స్పందించరని పవన్ కళ్యాణ్ ని గాని జనసేన పార్టీని గాని జనసేన కీలక నాయకుల గురించి గానీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, చిరంజీవి యువత రవి, జనసేన నాయకులు శ్రీధర్, సుధాకర్, ప్రవీణ్, సురేష్, హరిరెడ్డి, కొట్టే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.