వెంటనే ఈ.ఓ వ్యవస్థని రద్దు చేయాలని నేరేళ్ల సురేష్ డిమాండ్

గుంటూరు పట్టణంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో ఉన్న ఈ.ఓ వ్యవస్థని వెంటనే రద్దుచేయాలి. గతంలో ఈ విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ని వెంటనే అమలు పరచాలి. దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇచ్చిన జి.ఓ ని వెంటనే అమలుపరచాలి. ఆర్యవైశ్యులకు సంబంధించిన దేవాలయాల్లో రాజకీయ నాయకులకు ఎటువంటి ప్రమేయం ఉండకూడదు. ఆర్యవైశ్య కుల పెద్దల సమక్షంలో కానీ, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో కానీ, కమిటీని వేయాలి. ఇది వెంటనే అమలు చేయని పక్షంలో జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపడతామని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరేళ్ల సురేష్ తెలిపారు.