వినాయకుని అన్నసమారాధనలో పాల్గొన్న నేరెళ్ల సురేష్

గుంటూరు: 12వ డివిజన్ లోని గంజి బజార్ గాంధీ బొమ్మ వద్ద వినాయక ఉత్సవంలో భాగంగా గంజి బజార్ ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్, రాష్ట్ర కార్యదర్శి మార్కండేయులు, టిడిపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నజీర్ అహ్మద్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గంజి బజార్ ఫ్రెండ్స్ సర్కిల్ వారు గణేష్ ఉత్సవం భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేటి యువత సొసైటీపై బాధ్యతగా ఉంటూ సమస్యలపై ప్రశ్నిస్తూ అలాగే ప్రజాసేవ కార్యక్రమాల్లో ముందుంటూ యువత ఉత్సాహంగా మార్పు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పట్టిన జగన్ అనే విజ్ఞం తొలిగిపోవాలని వచ్చే వినాయక చవితికి జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వమే ఉండాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదె దుర్గాప్రసాద్, సెక్రెటరీ శివసందర్ కుమార్, నూజేటి అంజన్, టిడిపి 12 అవార్డు అధ్యక్షుడు షేక్ సలీం, గుంటూరు గణేష్, మోపిదేవి రాజేష్, హాఫిజ్, ఉత్సవ కమిటీ మోపిదేవి నాగరాజు, ప్రసాద్, హరీష్, మని పలువురు జనసేన టిడిపి పార్టీ కార్యకర్తలు మరియు ఉత్సవ కమిటీ వారు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.