ఇసుకతవ్వకాలు, రవాణాపై అమలులోనికి రానున్న నూతన ధరలు…ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ

తాజాగా ఏపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాలు మరియు రవాణా క్రమబద్దీకరణలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక తవ్వకాలు, లోడింగ్‌, సరఫరా, డోర్‌ డెలివరీకి వివిధ స్థాయిల్లో బేస్‌ రేట్లు నిర్ణయిస్తూ గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్‌ రీచ్‌లు, పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకానికి టన్నుకు రూ.90గా నిర్ణయించారు. జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్‌ రుసుము టన్నుకు రూ.25గా నిర్ధరించారు. ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వసూలు చేయనున్నారు. గోదావరి జిల్లాల నుంచి విశాఖకు ఇసుక రవాణా టన్నుకు జీఎస్టీతో కలిపి కి.మీ రూ.3.30గా నిర్ణయించారు. డోర్‌ డెలివరీ కోసం 10కి.మీ లోపు దూరానికి ట్రాక్టర్‌ ద్వారా టన్నుకు రూ.10, లారీ ద్వారా టన్నుకు రూ.8, పెద్ద లారీకి టన్నుకు రూ.7 వసూలు చేయనున్నారు. ఈ ధరలు 40 కి.మీ దూరం వరకు వర్తిస్తాయి. 40కి.మీ దాటితే ప్రతి టన్నుకు రూ అదనంగా 4.90 రూపాయల చొప్పున ధరను నిర్ణయిస్తూ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కొత్త ధరలపై ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.