గుంటూరు జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

గుంటూరు: నూతన సంవత్సరం పురస్కరించుకొని సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.