స్టేట్ ర్యాంకర్ గండి పోచమ్మను సత్కరించిన నిడదవోలు జనసేన

నిడదవోలు, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర మూడవ ర్యాంకు, నిడదవోలు ప్రధమ ర్యాంక్ సాధించిన నిడదవోలు మండలం, రావిమెట్లకి చెందిన గండి పోచమ్మకు గురువారం నిడదవోలు మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ నాయకులు రంగా రమేష్, ఉపాధ్యక్షులు మేడా పూర్ణచంద్రరావు, శాంతికుమార్, రాజా, రూపేంద్ర, యడ్లపల్లి సత్తిబాబు, రావిమెట్ల గ్రామ అధ్యక్షులు బాబీ, వీర్రాజు, సురేష్ నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.