ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో నిహారిక, చైతన్య ఫొటోషూట్

నిహారిక, చైతన్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో నిహారిక వివాహం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేశారు. ఈ వివాహంను రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌లో నిర్వహిస్తున్నారు. నాగబాబు తన కూతురు వివాహంను అత్యంత వైభవంగా చేయాలని కలలు కన్నాడు. అన్నట్లుగానే ఆమె కోరుకున్నట్లుగా నిర్వహించబోతున్నాడు. నిహారిక, చైతన్యల వివాహం డిసెంబర్ 9వ తేదిన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా జరగనుంది. వరుణ్‌తేజ్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని చూసుకుంటున్నాడు. పెళ్లికి కూడా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఇక పెళ్లి పనుల్లో అత్యంత ముఖ్యమైన పసుపు దంచే కార్యక్రమం ఇప్పటికే పూర్తి కాగా, మిగతా పనులని వేగవంతం చేశారు. ఇప్పుడు ఫొటోషూట్ కోసం నిహారిక, చైతన్యలు రాజస్థాన్ లో వాలినట్టు తెలుస్తుంది. తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్యాలెస్ లో దిగిన ఫొటో షేర్ చేయగా, ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.