ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్
మెగా డాటర్ నిహారిక-చైతన్యల వివాహం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ నెల 9న రాజస్తాన్ ఉదయపూర్లోని ఉదయ్ విలాస్ లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఆత్మీయులందరి కోసం తాజాగా కొణిదెల- జొన్నలగడ్డ కుటుంబాలు రిసెప్షన్ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ ప్రాంగణం లో శుక్రవారం రాత్రి రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ విందుకు మెగా హీరోలంతా ఫ్యామిలీతో ఈ శుభకార్యానికి హాజరై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రామ్చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
శుక్రవారం హైదరాబాద్లో జరిగిన రిసెప్షన్ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధు వరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి పలువరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. జేఆర్సీ కన్వెన్షన్ లోపలికి వెళ్లడానికి పాస్ వర్డ్ని క్రియేట్ చేశారు కుటుంబసభ్యులు. వేడుక కోసం జేఆర్సీ ప్రాంగణాన్ని గ్రాండ్గా డెకరేట్ చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు.