నిమ్మక జయకృష్ణ ముమ్మర ప్రచారం
పాలకొండ, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఎన్డీఏ తరఫున పాలకొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం చిన్నబగ్గ, కిసారాజోడు పంచాయితీలో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ శుక్రవారం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరించారు. కార్యక్రమంలో సీతంపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సవర తోట ముఖలింగం, టిడిపి సీనియర్ నాయకులు వెన్నపు శ్రీను, బిజెపి మండల నాయకురాలు ఆరిక అమల, సీతంపేట జనసేన నాయకులు బిడ్డిక విశ్వనాథం, ఆర్ రంగనాథం, తోయిక సంధ్యారాణి, ఐటిడిపి కో-ఆర్డినేటర్ ఇమరక పవన్ జనసేన-బిజెపి-టిడిపి శ్రేణులు యువత పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-12-at-15.08.16-1024x768.jpeg)