గడగమ్మ పంచాయతీ గ్రామంలో నిమ్మల నిబ్రమ్ సుడిగాలి పర్యటన

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం, గడగమ్మ పంచాయతీ గ్రామంలో జనసేన నాయుకులు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త ఎక్స్ జడ్పీటీసీ నిమ్మల నిబ్రమ్ సుడిగాలి పర్యటన చెయ్యడం జరిగింది. గడగమ్మ మహిళలు దాశబ్దాలుగా నీరు కోసం పడుతున్నటువంటి నీరు కష్టాలు చూసి నిబ్రమ్ చలించిపోయారు. ఈ గ్రామంలో మంచి నీరు కోసం సుమారు రెండు కిలోమీటర్లు రెల్లి తుప్పల్లులో ఏటి మధ్యలో నడుచుకొని వెళ్ళే దుస్థితి చుస్తే అసలు ప్రభుత్వం ఉందా స్థానిక యం యల్ ఏ గారు గ్రామ ప్రెసిడెంట్ ఏమి చేస్తున్నారు అని అన్నారు. మహిళలు వేసవికాలంలో వెళ్ళాలి అంటే యేటిలో ఉండే ఇసుకలో నడుచుకుంటూ వెళ్లడం వలన కాళ్ళు కాలే పరిస్థితి ఉంటుంది. అలానే వర్షకాలంలో నడవాలి అంటే బురదగా ఉండటం వల్లన ఇబ్బందిలు ఎలా ఎదురుకుంటున్నారో అర్ధం అవ్వుతుంది కనుక కచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు ఐనా తరువాత కచ్చితంగా ఈ గ్రామంలో నీరు సమస్య తీర్చే విధంగా మేము పని చేస్తాం కనుక కచ్చితంగా ఈ సారి వైస్సార్సీపీ ప్రభుత్వం పోవాలి ప్రజా ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలి అని కోరుకుంటున్నాను అని నిమ్మల నిబ్రమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గెడగాం జనసేన నాయుకులు జనసైనికులు వీరమహిళలు జనసేన జానీ కర్నెన సాయి పవన్ చరణ్ మజ్జి శ్రీనివాస్ నాగరాజు పాల్గొన్నారు.