ఓటీటీ లో ‘నిశబ్ధం’

కరోనా మహమ్మారి కారణంగా ధియెటర్లు మూతపడడంతో మేకర్స్ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేశ్‌ ‘పెంగ్విన్‌’, సుధీర్‌బాబు, నాని ‘v’ చిత్రాలు రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులో భాగంగానే తాజాగా అనుష్క ‘నిశబ్ధం’ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. బుధవారం అగ్రిమెంట్ పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల తేదిన అధికారికంగా ప్రకటించనున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఫిబ్రవరిలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కరోనా వలన పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. అనుష్కతో పాటుగా అంజలి, శాలిని పాండే, మాధవన్ ఈ చిత్రంలో ముఖ్య పోషించారు. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించగా, సినిమా ఎక్కువ భాగాన్ని విదేశాల్లోనే చిత్రీకరించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. సినిమా పైన అంచనాలు మరింత పెంచాయి.