నొ మై కాన్స్టిట్యూఎన్సీ 50వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: నొ మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని వినాయక స్ట్రీట్, మెయిన్ స్ట్రీట్ లో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రజలు డ్రైనేజ్ కాలువలు పునర్నిర్మాణం చేస్తామన్న అధికార పార్టీ పట్టించుకోలేదని తెలిపారు. కాలువలపై కప్పు లేక వ్యర్థ నీరు దుర్వాసన ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. మునిసిపల్ సిబ్బంది క్లీనింగ్ పనులు రోజువారీ చెయ్యడం లేదని, తద్వారా దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. తప్పకుండా అన్ని సమస్యలు మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా చేస్తామని మాట ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని వినుత ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు బాలాజీ, నితీష్ కుమార్, సురేంద్ర, తులసీ రామ్, జనసైనికులు ఉదయ్, ముని తదితరులు పాల్గొన్నారు.