నొ మై కాన్స్టిట్యూఎన్సీ 51వ రోజు

శ్రీకాళహస్తి: నొ మై కాన్స్టిట్యూఎన్సీ 51వ రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని గోపి కృష్ణ వీధిలో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కొన్ని సమస్యలు వినుత దృష్టికి ప్రజలు తెలిపారు. ప్రధానంగా స్ట్రీట్ లైట్లు ఉపయోగంలో లేవని, సీ సీ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, డ్రైనేజ్ కాలువలు సక్రమంగా లేదని, పారిశుధ్యం సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, నాయకులు తులసీ రామ్, జనసైనికులు భాను, వెంకటేష్, ప్రకాష్, సుధీర్, హేమంత్, వరుణ్, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు.