రవాణా శాఖ మంత్రుల భేటీ లేదు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు సోమవారం భేటీ కానున్నారని వచ్చిన వార్తలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల అంశంపై ఎలాంటి మంత్రుల స్థాయి సమావేశం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక భేటీ నిర్ణయం కాలేదని చెప్పారు. కిలోమీటర్ బేసిస్‌లో అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల స్థాయి సమావేశం ఉంటుందన్నారు. అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతూనే ఉంటాయని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.