నొ మై కాన్స్టిట్యూఎన్సీ: గుడిమల్లం గ్రామంలో వినుత కోటా పర్యటన

  • నొ మై కాన్స్టిట్యూఎన్సీ 36వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, గుడిమల్లం గ్రామంలో ఆదివారం నొ మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. గ్రామంలోని మహిళలు ప్రేమగా వినుత కు ఆహ్వానం పలికారు. పర్యటనలో గ్రామంలోని సి.సి రోడ్లు, డ్రైనేజీ కాలువల శుభ్రత, నిత్యావసర వస్తువుల ధరలు పెంపు, విద్యుత్ ధరల పెంపు మొదలగు సమస్యలను గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు జరిగిన మేలు గోరంత అయితే ప్రజల నుండి దోచుకున్నది కొండంత అని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇచ్చి చూస్తామని గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు లోక, వినోద్ కుమార్, నితీష్ కుమార్, చందు చౌదరి, భాను, వంశీ, చంద్ర, వెంకటరమణ, బాలాజీ, ఈశ్వర్, గాంధీ, జనసైనికులు మనోజ్, రవి, రాచపాళెం వంశీ, జగదీష్, అయ్యప్ప, కళ్యాణ్ రాయుడు, భీమేస్, మురుగ, లోకేష్, రాజా తదితరులు పాల్గొన్నారు.