రాజకీయాలకతీతంగా సేవా కార్యక్రమాలు: డాక్టర్ కందుల నాగరాజు

విశాఖ, నిరుపేదలకు సహాయం చేయడంలో తాను ఎప్పుడు ముందు ఉంటానని దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. సోమవారం స్థానిక 35వ వార్డులో నవ వధువు నెల్లి తిరుమలకు డాక్టర్ కందుల నాగరాజు బంగారు తాళిబొట్టు, పసుపు కుంకుమ, పట్టు చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా తను చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్యస్పందన వస్తుందన్నారు. వృద్ధులకు, వితంతువులకు, నిరుపేద విద్యార్థులకు, దివ్యాంగులకు నిర్విరామంగా తను సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నవ వధువు తల్లి ఆదిలక్ష్మి, జనసేన నాయకులు సోంబాబు, రఘు, టి.అర్జున్, వీర మహిళలు మంగ, యజ్ఞేశ్వరి, కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్, కనకరాజు, సత్తిబాబు పాల్గొన్నారు.

★ పవనన్న ప్రజా బాట కార్యక్రమం..

స్థానిక 35వ వార్డులో డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో పవనన్న ప్రజా బాట పాదయాత్ర ను నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్, కల్లుపాకలు ప్రాంతాలలో ఆయన పర్యటించి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి జనసేన అధికారంలోకి వస్తే చేసే మంచి పనులను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.