వరదల్లో చిక్కుకున్న వారికే కాదు.. నోరులేని జీవాలకు ఆహారం అందించిన బండారు శ్రీనివాస్

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలో, ఆత్రేయపురం మండలం, వద్దిపర్రు గ్రామములో వరదలలో దెబ్బతిన్న లంక రైతులను శనివారం కొత్తపేట నియోజక వర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ రైతులను కలిసి పలకరించినారు, ఈ సందర్భంగా అత్రేయపురం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు అధ్యక్షతన, బండారు శ్రీనివాస్ చేతుల మీదుగా 60 బస్తాల పశువుల దానాను రైతులకు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో చేకూరి కృష్ణంరాజుతోపాటు, ఆత్రేయపురం మండలం మాజీ ఎంపీపీ బెజవాడ సతీష్ మరియు వద్దిపర్రు జనసేన పార్టీ అధ్యక్షులు అడ్డాల వీరబాబు, అడ్డగల శ్రీను, జ్యోతి, తమ్మిశెట్టి సత్యనారాయణ, వీరవెల్లి దాసు, మరియు రాజవరం, పేరవరం, పులిదిండి గ్రామ జనసేన అధ్యక్షులు, గ్రామ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.