తెలంగాణ డిగ్రీ విద్యార్దులకు గమనిక.. రెండో విడత దోస్త్‌ సీట్లు

తెలంగాణ డిగ్రీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ‘దోస్త్’కు సంబంధించిన రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు పూర్తయినట్లు కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. రెండో విడతలో కొత్తగా గురువారం 60,539 మందికి సీట్లు కేటాయించారు. మొదటి విడతలో సీట్లు పొంది రెండో విడతలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో 5,180 మందికి మెరుగైన సీట్లు లభించాయి. రెండో విడత వరకు చూస్తే.. రాష్ట్రంలోని మొత్తం 986 డిగ్రీ కళాశాలల్లో 4,09,450 సీట్లు ఉండగా ఇంకా 2,41,266 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 123 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 69,660 సీట్లు ఉంటే మొదటి విడతలో 26,439 మంది సీట్లు నిర్ధరించుకున్నారు. రెండో విడతలో 19,309 మందికి సీట్లు దక్కాయి.. మూడో విడత ప్రవేశాల కోసం ఈ నెల 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌, 6వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఆయన తెలిపారు.