ఎన్నారైలు జనసేన పార్టీకి వెన్నెముక: అల్లు రమేష్

పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం నాయకులు గ్రామాలలో పర్యటిస్తూ జనసేన సిద్ధాంతాలు గురించి మరియు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే టీమ్ సైనిక మరియు యూఏఈ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో అందించిన క్యాలెండర్లను ఇంటింటికీ వెళ్లి మరి ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి అల్లు రమేష్ మాట్లాడుతూ ఎన్నారైలు జనసేన పార్టీకి వెన్నెముక అని, వారు అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. ఎల్లలు దాటినా వారి మనసు మాత్రం రాష్ట్ర భవిష్యత్తు, దాని అభివృద్ధి కోసం పాటు పడుతున్న పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటుందని, పవన్ కళ్యాణ్ శ్రీరాముడు అయితే వాళ్ళు వానర సైన్యం లాంటివారు అని ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే పార్వతీపురం నియోజకవర్గం తరుపున టీమ్ సైనిక మరియు యూఏఈ జనసేన టీం మెంబెర్స్ కి మరియు టీం లీడర్లు అయిన అమీర్ ఖాన్ & అప్పారావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.