ముంగండ జనసైనికులకు అండగా నిలిచిన ఎన్నారై జనసేన నాయకులు

పి.గన్నవరం, ఇటీవల జరిగిన జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో జరిగిన సభకు వెళ్లి తిరిగి వసస్తూ గన్నవరం నియోజకవర్గం, ముంగండ గ్రామ జనసైనికులుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన ఎన్నారై టీం. గాయపడిన జనసైనికులకు జనసేన నాయకులు పెనుమాల జాన్ బాబు, మోగళ్ళ చంద్రశేఖర్ 10 వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారై జనసేన నాయకులు పెనుమాల జాన్ బాబు, జనసేన నాయకులు గన్నవరం మండల ప్రెసిడెంట్ జేడీ, అమలాపురం రూరల్ మండల జనసేన నాయకులు లింగోలు పండు, డిఎస్ఎన్ కుమార్, తోట శ్రీనివాస్, కొమ్మూరి మల్లిబాబు మరియు గన్నవరం నియోజకవర్గ ముంగండ గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.