Nuzvid: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి జనసేనపార్టీ అండ

నూజివీడు నియోజకవర్గంలో కొప్పురి శ్రీను అను వ్యక్తి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నానని జనసేనపార్టీ నాయకులకు తన గోడు వెలిబుచ్చారు. తనకి రెండు నెలలకోసారి రక్తం మార్చాలని రక్తమర్పిడి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పగా జనసేనపార్టీ నూజివీడు నాయకుడు మరీడు శివరామకృష్ణ ఆ వ్యక్తికి కావలసిన రక్తం, ఇతర అవసరాలు తీరుస్తానని హామీ ఇచ్చి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు ఎం సునీల్ కుమార్, చట్రాయి నాయకులు తుమ్మల జగన్, అరెల్లి కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.