కొరగాము గ్రామంలో 17వ రోజు జనంతో జనసేన
ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ), నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమం 17వ రోజు కొరగాము గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను మరియు ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. సమస్యలు పరిష్కారమయేంతవరకు గ్రామం తరపున జనసేన పోరాటం చేస్తుందని భరోసా ఇవ్వడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట శ్రీను, సెపెన రమేష్, పొట్నూరు ప్రసాద్, మోహన్, ఎస్ రాజశేఖర్, ఎమ్ రాజశేఖర్, ఉపేంద్ర, ప్రసాద్, సాయికుమార్, హేమంత్, రాంబాబు మరియు జనసేన కార్యకర్తలు, కోరగాము గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-06-at-16.38.52-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-06-at-16.38.52-1024x768.jpeg)