గాంధీ జయంతి సందర్భంగా మదనపల్లె జనసేన ఆధ్వర్యంలో అన్నసంతర్పణ
మదనపల్లె నియోజకవర్గం, చిత్తూర్ బస్టాండ్ లో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసు చౌదరి ఆధ్వర్యంలో అహింసా పరమో ధర్మః అంటూ, బ్రిటీష్ వారిని తరిమికొట్టిన శాంతి కాముకుడు, ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత, స్వాతంత్ర్య సమరయోధుడు భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లె మండల అధ్యక్షుడు గ్రానైట్ బాబు, నిమ్మనపల్లె మండల కమిటీ కళ్యాణ్ ప్రదీప్ కుమార్ రెడ్డి రామసముధ్రం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ గజ్జెల రెడ్డప్ప, సనఉల్లా జగదీశ్ రాజేశ్ నవీన్ కుమార్, కొలిమి ప్రసాద్ మరియు వీర మహిళలు రెడ్డమ్మ, కొల నాగవేణి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-16.17.16-1024x518.jpeg)